11, నవంబర్ 2011, శుక్రవారం

PADMALAYA NAADI JYOTHISHYAM


భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆకాంక్ష ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. జీవితంలో జరిగే మంచి చెడులను తెలుసుకునేందుకు జ్యోతిష్కులను ఆశ్రయిస్తుంటారు. కొందరు హస్త సాముద్రికం ఆధారంగా చెబుతుండగా, ఇంకొందరు సంఖ్యాశాస్ర్తాన్ని ఆధారంగా చేసుకుని, మరికొందరు గ్రహ సంచారాల ఆధారంగా జాతకాలు చెబుతుంటారు. చేతిలోని రేఖల ఆధారంగా చెప్పేది హస్త సాముద్రికం కాగా, గ్రహ గతుల ఆధారంగా చెప్పేది జన్మకుండలి ఆధారిత జ్యోతిష్యం.

జన్మకుండలి ఆధారంగా జాతకాలు తెలుసుకునేందుకు వ్యక్తి పుట్టిన తేదీ (నెల, సంవత్సరంతో సహా), సమయం, పుట్టిన ప్రదేశం తప్పనిసరి. ఇవన్నీ కచ్చితంగా ఉంటే జాతకం కూడా కచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. జనన సమయం సరిగా ఉండాలి. ఇదే లగ్నం నిర్ణయించేందుకు ముఖ్య ఆధారం. ఈ లగ్నాన్ని బట్టే ఫలితాలు నిర్ధారించడం సాధ్యమవుతుంది. 

అలాగే, లగ్నం కచ్చితంగా నిర్ధారించేందుకు పుట్టిన ప్రదేశం కూడా ముఖ్యమే. సూర్యోదయ సమయాలు ఆయా ప్రాంతాలనుబట్టి కొన్ని నిమిషాలు హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని ఆధారంగా లగ్న నిర్ణయం చేయాల్సి ఉంటుంది. మేషాది మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ప్రమాణం సుమారు రెండు గంటల వరకు ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు నిమిషాల తేడాలో లగ్నం మారవచ్చు. పుట్టిన ప్రదేశం తెలుసుకోవడం ద్వారా లగ్నంలో తేడాలు రాకుండా చూసే అవకాశముంటుంది.

కొందరికి పుట్టిన తేదీ, సమయం తెలియదు. వారి పెద్దలు చెప్పే కొండ గుర్తుల ద్వారా కొంతవరకు సంవత్సరం, తేదీ, నక్షత్రం వంటివి నిర్ధారించవచ్చు. అయితే, జన్మ కుండలి వేయడం దీనివల్ల సాధ్యం కాదు. కేవలం రాశి ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Tanuku Venkata Ramana Murthy[divagna Sarma]
Padmalaya naadi jyothisya nilayam
E.Mail;;divagnasarma@gmail.com
ALAMURU=533233     E.G.DIST
Cell.No;9014813074 /9492164989

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి